ASF: కాగజ్ నగర్ పట్టణం సర్ సిల్క్ కాలనీలో ఇంటి తాళాలు పగులగొట్టి చోరికి పాల్పడిన దొంగలను గురువారం అరెస్ట్ చేసినట్లు SP నితిక పంత్ తెలిపారు. గత నెల 3న దండే మంగా ఇంటికి తాళం వేసి హైదరాబాద్ వెళ్లగా ఇంటి తాళం పగలగొట్టి 72 తులాల బంగారు ఆభరణాలు, కిలో వెండి, రూ.2,75,000 అపహరించినట్లు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామన్నారు.