ఆదిలాబాద్: నార్నూర్ మండల కేంద్రంలో వివిధ సంఘాల నాయకులు బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంట్ సాక్షిగా అంబేడ్కర్పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా అంబేడ్కర్ చిత్రపటాలతో నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రి వెంటనే దేశ ప్రజలకు క్షమాపణలు కోరి తన పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.