SRPT: ప్రభుత్వ పథకాల అమలుకు 2027 జనాభా లెక్కలు కీలకమని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. బుధవారం అధికారుల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. మే 11 నుంచి జూన్ 9 వరకు తొలి దశ ఇళ్ల జాబితా నమోదు, 2027 ఫిబ్రవరిలో రెండో దశ గణన జరుగుతుందని వివరించారు. తొలిసారిగా డిజిటల్ విధానంలో మొబైల్ యాప్ల ద్వారా ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.