TG: వెలుగుమట్లలో ప్రత్యేక లేఅవుట్ ఏర్పాటు చేసి లబ్ధిదారులకు ఇళ్లు నిర్మిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. పేదలు నిర్భయంగా, ఆత్మగౌరవంతో జీవించాలనే ఉద్దేశంతోనే ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నామని స్పష్టం చేశారు. పట్టాలు పొందిన వారందరికీ ప్రభుత్వమే స్వయంగా ఇళ్లు నిర్మించి ఇస్తుందని హామీ ఇచ్చారు. ఈ నిర్మాణ పనులన్నీ డిసెంబర్ 9 నాటికి పూర్తి చేస్తామని పేర్కొన్నారు.