NRPT: ఇటీవల నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగిన దారుణాన్ని వ్యతిరేకిస్తూ మక్తల్ మండలం చిట్యాల గ్రామంలో సోమవారం రజక, ముదిరాజ్ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అనంతరం చిన్నారి ఫొటోకు నివాళులు అర్పించారు. వారు మాట్లాడుతూ.. జరిగిన ఘటనలో ప్రధాన నిందితుడిని వెంటనే చట్టరీత్యా శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు, పెద్దలు పాల్గొన్నారు.