WGL: రాయపర్తి మండలం మైలారం చెందిన రిటైర్డ్ ఎస్సై లేతకుల బుచ్చి రెడ్డి (61) హైదరాబాద్లో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. 1984లో కానిస్టేబుల్గా చేరి సుదీర్ఘకాలం సేవలందించిన ఆయన 2026 జనవరిలో కేయూ స్టేషన్ ఎస్సైగా పదవీ విరమణ పొందారు. పదవీ విరమణ ప్రయోజనాలు, పింఛన్ సెటిల్మెంట్ ఆలస్యం కావడంతో మానసిక ఆందోళనకు గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.