JN: నర్మెట్ట మండలంలో ఇటీవల నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులకు ఈనెల 9వ తేదీ నుంచి నేటి వరకు శిక్షణ శిబిరాలను నిర్వహించారు. శిక్షణ పూర్తి చేసుకున్న వార్డు సభ్యులకు నేడు అధికారులు సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. గ్రామాల సమగ్ర అభివృద్ధిలో వార్డు మెంబర్లు భాగస్వాములు కావాలని, అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని అధికారులు సూచించారు.