BHNG: శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు ప్రధాన ఘట్టం ఎదుర్కోళ్ల మహోత్సవం ప్రత్యేక సేవలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు మోహిని అలంకార సేవతో వేదపారాయణం ప్రారంభమవుతుంది. రాత్రి 8గంటలకు అశ్వ వాహన సేవ, 8:45 ఎదుర్కోళ్ళు మహోత్సవం నిర్వహించనున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారి దర్శనం పొందాలని ఆలయ ఈవో కోరారు.