NLG: ప్రతి ఒక్కరూ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. సోమవారం గుండ్లపల్లి(డిండి) మండలం దాసరినెమలిపూర్ గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి 39వ బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని పెంపొందించుకోవాలని అన్నారు.