HYD: శ్రీరామ నవమి సందర్భంగా రేపు హైదరాబాద్ ‘కాషాయ’మయం కానుంది. సీతారాంబాగ్, ఆకాశపురి నుంచి హనుమాన్ టేక్డ్ వరకు భారీ శోభాయాత్రకు సర్వం సిద్ధమైంది. ఒకవైపు ఆలయాల్లో సీతారాముల కళ్యాణోత్సవాలు, మరోవైపు ‘జై శ్రీరామ్’ నినాదాల మధ్య ఆధ్యాత్మిక చైతన్యం వెల్లివిరియనుంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు భారీ బందోబస్తుతో పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.