KNR: తెలంగాణ సమగ్ర శిక్షా ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ కలెక్టరేట్ ముందు నిర్వహిస్తున్న సమ్మె 16వ రోజుకు చేరుకుంది. వంట వార్పు కార్యక్రమంతో ఉద్యోగులు నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, తమ నాణ్యమైన డిమాండ్లను నెరవేర్చే వరకు సమ్మె కొనసాగిస్తామని అన్నారు.