ADB: మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం ఉట్నూర్ మండలం దంతన్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన స్పెషలిస్ట్ మెడికల్ క్యాంపును సందర్శించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు.