NLG: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్రెడ్డి శనివారం నల్గొండకు వస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్గొండ పట్టణంలోని ఒక హోటల్లో ఓటర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్ర మంత్రి పాల్గొంటారని పేర్కొన్నారు.