NGKL: కుమ్మెర మల్లన్న జాతర ఘర్షణపై గురువారం జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ స్పందించారు. రెండు వర్గాల మధ్య జరిగిన దాడులపై కేసులు నమోదు చేసి, ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. శిశువు మృతిపై అనుమానాస్పద కేసు నమోదు చేశామని, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా అవసరమైతే మర్డర్ సెక్షన్లు చేరుస్తామన్నారు.