NRPT: మరికల్ మండల కేంద్రంలోని అభయాంజనేయ స్వామి దేవాలయం వద్ద ఉగాది సందర్భంగా వేద పండితులు పంచాంగ శ్రవణం నిర్వహించారు. పరాభవ సంవత్సరంలో అందరికీ శుభం కలగాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని ఆశించారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దసరా కట్ట వద్ద కాషాయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సర్పంచ్, అఖిలపక్ష నాయకులు పాల్గొన్నారు.