KNR: చొప్పదండి మున్సిపాలిటీలో ప్రజలకు శుద్ధి చేసిన నీటిని 5 రూపాయలకే 20 లీటర్ల క్యాన్ చొప్పున అందిస్తున్నట్లు చైర్ పర్సన్ వడ్లూరి సరిత శ్రీనివాస్ తెలిపారు. ఊరిలోని మంచినీళ్ల బావి నుంచి నీటిని సేకరించి, శుద్ధి చేసి ఈ సదుపాయం కల్పిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. కాయిన్ బాక్స్లో 5 రూపాయలు వేసి నీటిని పొందవచ్చని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి కోరారు.