PDPL: సింగరేణి RG–1 జీడీకే–11 ఇంక్లైన్ గనిలో మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా గని ఏజెంట్ చిల్క శ్రీనివాస్ మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా నారీశక్తి అవార్డు పొందిన అల్లం నవ్యశ్రీని అభినందించారు. ఈ విజయం మహిళా ఉద్యోగులందరికీ గర్వకారణమని ఆయన అన్నారు. మహిళా ఉద్యోగులు కంపెనీ లక్ష్యాల సాధనలో ముందుండాలని సూచించారు.