SRCL: నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో రజక కుటుంబంపై జరిగిన దాడిని, ఆ ఘటనలో రెండేళ్ల చిన్నారి మృతి చెందడాన్ని బీసీ సాధికారిత సంఘం తీవ్రంగా ఖండించింది. బుధవారం వేములవాడలోని సంఘం కార్యాలయంలో మృతి చెందిన చిన్నారికి సంతాపం ప్రకటించారు. ఈ దాడికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని, బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు.