GDWL: మాజీ ఎమ్మెల్యే ఉప్పల గోపాల్ రెడ్డి ఆశయాలు కొనసాగిస్తామని సిటిజన్ ఫోరం జిల్లా అధ్యక్షుడు మోహన్ రావు పేర్కొన్నారు. ఆయన 33వ వర్ధంతిని పురస్కరించుకొని మంగళవారం పట్టణంలోని రాయల్ లాడ్జి దగ్గర ఉన్న విగ్రహానికి కుటుంబ సభ్యులు సిద్ధార్థ రెడ్డి, రఘునాథ్ రెడ్డితో కలిసి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.