కామారెడ్డి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అడుగుజాడల్లో నడవాలని కల్లుగీత కార్మిక సంఘ జిల్లా అధ్యక్షుడు సైదగౌని వెంకట్ గౌడ్ చెప్పారు. గురువారం పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పాపన్న గౌడ్ చేసిన సేవలను కొనియాడారు.