SDPT: కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రముఖ కవి నందిని సిద్ధారెడ్డి దంపతులను మాజీ మంత్రి హరీశ్ రావు ఘనంగా సన్మానించారు. ‘అనిమేష’ కవితా సంపుటికి ఈ పురస్కారం రావడం తెలంగాణకు దక్కిన గౌరవమని ఆయన కొనియాడారు. ఉద్యమ సమయంలో సిద్ధారెడ్డి పోషించిన పాత్ర మరువలేనిదని, ఆయన ప్రతిభకు ఈ అవార్డు నిదర్శనమని హరీశ్ రావు, దేశపతి శ్రీనివాస్ గుర్తుచేసుకున్నారు.