MLG: టీచ్ ఫర్ చేంజ్ ట్రస్ట్ ఫౌండర్, సినీనటి మంచు లక్ష్మి మంగళవారం మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిశారు. తమ సంస్థ ఆధ్వర్యంలో మార్చి 27 నిర్వహిస్తున్న కార్యక్రమానికి రావాలని ఆమె మంత్రిని ఆహ్వానించారు. తాను స్థాపించిన ఫౌండేషన్ సేవా కార్యక్రమాలను మంచు లక్ష్మి మంత్రికి వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్య కోసం తమ సంస్థ చేయూతనిస్తున్నదన్నారు.