KNR: తిమ్మాపూర్ మండలం నల్లగొండ గ్రామంలో జరుగుతున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలను ధర్మకర్తలు, అధికారులు సమన్వయంతో పని చేసి విజయవంతం చేయాలని మానకొండూర్ MLA డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కోరారు. గురువారం శ్రీ లక్ష్మీనర్సింహస్వామి వారిని దర్శించుకొని ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో నిర్మించిన ప్రహారీ గోడను ప్రారంభించారు.