MBNR: ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని విద్యార్థులు ముందుకు సాగాలని మహబూబ్ నగర్ శాసనసభ్యులు యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని బోయపల్లి రోడ్డులో ఉన్న IIIT కళాశాలలో ప్రత్యేక ఉచిత శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గడిచిన పది సంవత్సరాల కాలంలో విద్యా రంగాన్ని ఎవరు పట్టించుకోలేదన్నారు.