KNR: రామడుగు మండలంలోని వెలిచాల గ్రామంలో రూ. 20 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రథమ లక్ష్యమని, మౌలిక వసతుల కల్పనకు నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.