మహబూబ్ నగర్: మిడ్జిల్ మండలంలోని వెలుగోములలో సర్పంచ్ సువర్ణమ్మ అధ్యక్షతన శనివారం గ్రామసభ నిర్వహించారు. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని గ్రామంలో తాగునీటి ఎద్దడి కలగకుండా పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు అండర్ డ్రైనేజీ, వీధి దీపాలు, సమస్యలను సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లారు. పంచాయతీ కార్యదర్శి వినీల ఉన్నారు.