NGKL : జిల్లా కేంద్రంలోని టీటీడీ కల్యాణ మండపంలో ప్రముఖ అవధాని చుక్కాయిపల్లి శ్రీదేవి రచించిన ‘సాత్వికోత్తమ శతకం’ గ్రంథ ఆవిష్కరణ ఘనంగా జరిగింది. ఓయూ తెలుగు శాఖ పూర్వాధ్యక్షులు ఆచార్య కసిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. అష్టావధానం, శతావధానాల్లోని అంశాలను గ్రంథరూపంలోకి తేవడం అభినందనీయమని ఆయన కొనియాడారు.