ABD: సింగరేణి సంస్థ బొగ్గును తీసి సిల్ట్ ప్రాజెక్టులోకి వదలడం వల్ల కెనాల్లోకి సిల్ట్ చేరి జామ్ అవుతోందని, దీంతో నీరు రాక తీవ్రంగా ఇబ్బంది పడాల్సివస్తోందని రెబ్బెన మండల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మికి వినతిపత్రం అందజేశారు. కెనాల్స్కు మరమ్మతులు చేపించి తమను ఆదుకోవాలని కోరారు.