BHPL: ఉమ్మడి జిల్లాలోని 7 పాలిటెక్నిక్ కళాశాలల్లో మొత్తం 1,980 సీట్లు అందుబాటులో ఉన్నాయి. కాటారం పాలిటెక్నిక్లో ఈ ఏడాది నుంచి ‘డిప్లమా ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్’ కొత్త కోర్సు ప్రారంభమవుతుందని ప్రిన్సిపల్ రాజ్ కుమార్ తెలిపారు. పాలిసెట్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది, ఏప్రిల్ 20 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. మే 13న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.