NRPT: “Arrive Alive” లో భాగంగా హిందూపురంలో ఉపసర్పంచ్ వాకిటి బాబు ఆధ్వర్యంలో సోమవారం రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ కార్యదర్శి మహేష్, పోలీసులు కలిసి ప్రజలకు ట్రాఫిక్ నియమాలను వివరించారు. హెల్మెట్, సీటుబెల్టు ధరించాలని, మద్యం తాగి వాహనాలు నడపరాదని సూచించారు. అతివేగం, మొబైల్ ఫోన్ వాడటం వల్ల జరిగే ప్రమాదాల పట్ల ప్రజలను అప్రమత్తం చేశారు.