RR: ఆడుకుంటూ వెళ్లి బాలిక నీటి సంపులో పడి మృతి చెందిన ఘటన మంచాల మండల పరిధిలో చోటుచేసుకుంది. మండల పరిధిలోని తాళ్లపల్లిగూడలో ఆడుకునేందుకు వెళ్లిన బాలిక తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించారు. దీంతో ఇంటి పక్కనే ఉన్న నీటి సంపులో బాలిక మృతదేహం లభ్యం కావడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.