ఆదిలాబాద్: దేవాలయాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే బొద్దు అన్నారు. బుధవారం కడెం మండలంలోని మాసాయిపేట్ గ్రామంలో హనుమాన్ మందిర్ ప్రారంభం, విగ్రహ ప్రతిష్టాపనలో ఆయన పాల్గొన్నారు. ప్రజలు భక్తి మార్గంలో నడవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు ఉన్నారు.