KNR: చొప్పదండి మండలం పెద్దకుర్మపల్లె అంగన్వాడీ సెంటర్లో ఐసీడిఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం సభ నిర్వహించారు. సర్పంచ్ మవురం సుగుణ అధ్యక్షత వహించగా సీడీపీఓ నర్సింగరాణి హాజరై మాట్లాడుతూ.. ఎత్తుకు, వయసుకు తగ్గ బరువు లేని పిల్లలకు పౌష్టికాహారం అందించాలని తల్లులకు వివరించారు. అనంతరం గర్భిణీలకు సీమంతాలు నిర్వహించి మహిళా సాధికారత గురించి తెలిపారు.