BDK: గత ఐదు దశాబ్దాలుగా పీడిత ప్రజల పక్షాన నిలబడుతూ ఎన్నో పోరాటాలు చేసి నేడు జనజీవన స్రవంతిలో కలవడం సరైన నిర్ణయమని యువతరం పార్టీ నాయకులు కొనియాడారు. లొంగిపోయిన మావోయిస్టులకు యువతరం పార్టీ ఆహ్వానం పలుకుతుందని రాష్ట్ర అధ్యక్షుడు గుజ్జుల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. భద్రాచలంలో గురువారం జరిగిన సమావేశంలో మాట్లాడారు.