JGL: ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ తండాకు చెందిన మాలవత్ నిఖిల్ నాయక్ ఆంగ్ల భాష విద్య విభాగంలో PHD పట్టా పొందారు. ‘మల్టీ మోడల్ కంపోజిషన్స్ ఇన్ ది ఇండియన్ ఈఎస్ఎల్ క్లాస్ రూమ్’ అనే శీర్షికతో ఆయన సమర్పించిన పరిశోధన గ్రంథానికి దేశంలోనే ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయమైన ది ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ పొందారు.