NRPT: నారాయణపేట మండలం బోయలపల్లి నుంచి బొమ్మన్ పాడు వరకు చేపట్టిన రోడ్డు పనులు మధ్యలోనే నిలిచిపోయాయని కోటకొండ ఆటో యూనియన్ నేతలు తెలిపారు. శనివారం ఎంపీ డీకే అరుణకు వినతిపత్రం అందజేసి పనులు పూర్తి చేయాలని కోరారు. కాంట్రాక్టర్ పనులు నిలిపివేయడంతో రోడ్డుపై ప్రయాణం కష్టంగా మారిందని యూనియన్ నేత రాజు వివరించారు. కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.