BHPL: మొగుళ్ళపల్లి(M)పర్లపల్లి గ్రామానికి చెందిన గీత కార్మికుడు తిరుపతి (40) తాటి చెట్టు దిగుతున్న సమయంలో కిందపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న TRP మొగుళ్ళపల్లి మండల అధ్యక్షులు రాజేష్, పర్లపల్లి గ్రామ యువజన అధ్యక్షుడు కాశెట్టి రాజేష్ ఆసుపత్రికి వెళ్లి బాధితుడని పరామర్శించారు. ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సహాయం అందించాలన్నారు.