MBNR: రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం ద్వారా 290 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారని మంగళవారం కలెక్టర్ కుష్బూ గుప్తా తెలిపారు. రూ.10,000 కోట్ల ఛార్జీల మైలురాయిని చేరిన సందర్భంగా మంగళవారం బస్టాండ్లో ఉత్సవాలు నిర్వహించారు. మహిళల ఆర్థికాభివృద్ధికి ఈ పథకం ఎంతో దోహదపడిందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎం సంతోష్ కుమార్ పాల్గొన్నారు.