RR: తలకొండపల్లి మండల పరిధిలోని లింగరావుపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన హైమాస్ట్ విద్యుత్ దీపాలను ఉగాది పర్వదినం సందర్భంగా నిన్న సాయంత్రం సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. గ్రామస్తుల విన్నపం మేరకు నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రత్యేక నిధులు మంజూరు చేయడంతో ఈ లైట్లను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు.