KMR: మద్నూర్కు చెందిన తివారీ దివ్య ఆలిండియా సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. 6వ తరగతి ప్రవేశం కోసం నిర్వహించిన ఈ పరీక్షలో దివ్య 300 మార్కులకు గాను 150 మార్కులు సాధించి అర్హత సాధించారు. సాధారణ కుటుంబానికి చెందిన తివారీ పూజ-నందకిషోర్ దంపతుల కుమార్తె అయిన దివ్య, జాతీయ స్థాయి పరీక్షలో రాణించడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.