BDK: కొత్తగూడెం స్థానిక వివేకవర్ధని డిగ్రీ & పీజీ కళాశాలలో విద్యార్థులకు సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సైబర్ క్రైమ్ డీఎస్పీ అశోక్ కుమార్, ఎస్సై జితేందర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆన్లైన్ మోసాలు, ఫిషింగ్, సోషల్ మీడియా స్కామ్స్ గురించి విద్యార్థులకు వివరించారు.