MBNR: జడ్చర్ల మండలం బోయలకుంటలో గత నెలలో బీటీ రోడ్డు ఏర్పాటు సందర్భంగా మిషన్ భగీరథ పైప్ లైన్ ధ్వంసమయ్యింది. విషయాన్ని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన స్పందించి రూ.2 లక్షలు డీఎన్ఎఫ్టీ నిధులు మంజూరు చేశారు. నూతన పైపులైన్ పనులు పూర్తి కావడంతో శనివారం సర్పంచ్ జోగు లక్ష్మమ్మ వెంకటరమణ పూజలు నిర్వహించి మిషన్ భగీరథ నీటిని పునరుద్ధరించారు.