HYD: సికింద్రాబాద్ రైల్వే టాస్క్ ఫోర్స్ పోలీసులు సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్ల వద్ద తనిఖీలు నిర్వహించారు. సుమారు రూ.79,230 విలువైన 70 బాటిళ్ల అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నారు. అక్రమ మద్యం రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఈ ఘటనలో ఒకరిని అరెస్ట్ చేశారు.