MDK: చిలిపిచేడ్ మండలంలోని శిలాంపల్లి గ్రామానికి చెందిన మంగలి రామయ్య మృతి పట్ల సర్పంచ్ రాజేందర్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు, బాధిత కుటుంబానికి తన వంతుగా రూ.10,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఆపదలో ఉన్న వారికి అండగా ఉంటామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.