MDK: నిర్మల్ జిల్లా బైంసాలో జరిగిన ‘అశ్మిత ఖేలో ఇండియా ఉషు లీగ్’ పోటీల్లో మెదక్ జిల్లా రామాయంపేట పట్టణానికి చెందిన జమాల్పూర్ హీనా మాధురి బంగారు పతకం సాధించి సత్తా చాటింది. సీనియర్ 75 కేజీల విభాగంలో ఆమె ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా ఉషు సంఘం రాష్ట్ర కార్యదర్శి పోచయ్య, ఒమర్ అంతర్జాతీయ కోచ్ సాయికృష్ణ ఆమెను అభినందించారు.