ADB: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు వన్ టౌన్ CI సునీల్ కుమార్ బుధవారం తెలియజేశారు. నిందితులు హర్ష సాయి తేజ, ఎర్రోజివర్ అశోక్, కేంద్ర వెంకటి రెండు నుంచి మూడు రోజులపాటు జైలు శిక్ష విధిస్తూ ప్రిన్సిపల్ JFCM న్యాయమూర్తి భుక్య హుస్సేన్ తీర్పును వెల్లడించారు. మద్యం సేవించి వాహనాలను నడపరాదని CI సునీల్ కుమార్ సూచించారు.