ఖమ్మం: బచ్చోడును మండలంగా ఏర్పాటు చేయాలని అఖిలపక్ష నేతలు యాదగిరి, రమేష్ డిమాండ్ చేశారు. బుధవారం అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డికి వినతిపత్రం అందజేసి, 18 గ్రామ పంచాయతీల తీర్మానాలను సమర్పించారు. తిరుమలాయపాలెం మండల కేంద్రం దూరంగా ఉండడంతో బచ్చోడును మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరారు.