NGKL: కొండనాగుల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలోని రైతులకు నేడు యూరియా అందుబాటులో ఉండనుంది. ఉదయం 10 గంటల నుంచి స్టాక్ పంపిణీ చేస్తామని సీఈవో గుజ్జ రాజవర్ధన్ రెడ్డి తెలిపారు. రైతులు తమకు కావాల్సిన ఎరువులను ఫెర్టిలైజర్ మొబైల్ యాప్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని ఆయన సూచించారు. యాప్లో ముందస్తుగా బుకింగ్ చేసుకున్న వారికే యూరియాను అందజేస్తామన్నారు.