KMM: గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ముదిగొండ మండలంలో నామినేషన్ల ఉపసంహరణ సందర్భంగా ఎస్సై అశోక్ భద్రతా ఏర్పాట్లను శనివారం పర్యవేక్షించారు. ఉపసంహరణ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. వెంకటాపురం, ముదిగొండ, న్యూ లక్ష్మీపురం, మాదాపురం గ్రామ పంచాయతీల నామినేషన్ల కేంద్రాలను వారు తనిఖీ చేశారు.