SDPT: తొగుట మండలం చందాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులై తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. అనంతరం ప్రధానోపాధ్యా యులు సిద్ధేశ్వర్ మాట్లాడుతూ.. సమాజానికి దిశానిర్దేశం చేసేది ఉపాధ్యాయులేనని, విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు.